గుడుంబా తయారీకేంద్రాలపై దాడులు

7 Aug, 2015 12:56 IST|Sakshi

వరంగల్(ఏటూరునాగారం): వరంగల్ జిల్లాలో ఏటూరు నాగారం మండలం భట్టాయిగూడెంలో తెల్లబెల్లంతో గుడుంబా తయారు చేస్తున్న స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడిచేశారు. తయారీ కేంద్రం నుంచి సుమారు 5 వేల లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రావడం గమనించి తయారీదారులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు