సాక్షి, సూర్యాపేట: జిల్లాకేంద్రంలో ఓ కాలేజీ హాస్టల్లో గంజాయి దొరకడం కలకలం రేపింది. వివరాలివి.. పోలీసుల తనిఖీల్లో గాయత్రి కాలేజీ హాస్టల్లో గంజాయి దొరికింది. దీనిపై హాస్టల్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం సహకారంతోనే ఇక్కడ గంజాయి దాచారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి.