పోలీస్‌ పహారాలో ఉట్నూరు ఏజెన్సీ

19 Dec, 2017 11:04 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్: ఉట్నూరు ఏజెన్సీ వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటుచేశారు. ఏజెన్సీలోని సమస్యాత్మక మండలాలుగా ఉన్న ఉట్కూరు, ఇంద్రవెల్లి, నార్నూర్‌ మండలాల్లో భారీ బందోబస్తు కల్పించారు. అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్‌, సర్పూర్‌, కెరమెరిలో 144 సెక్షన్‌ విధించారు. ఐజీ నాగిరెడ్డి, ఎస్పీ కలమేష్‌సింగనవార్‌ ఈ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఉట్నూరు ఏజెన్సీలో లంబాడాలు-ఆదివాసీల మధ్య ఘర్షణలు తలెత్తిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు