పోలీసుల లాఠీచార్జి..ఎల్లారెడ్డి బంద్‌కు పిలుపు

5 Jul, 2018 21:42 IST|Sakshi

కామారెడ్డి జిల్లా : ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట్లో ప్రమాదవశాత్తు చెరువులో పడి సిద్ధవ్వ(45) అనే మహిళ మృతి చెందారు. దీంతో సిద్ధవ్వ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకుల ధర్నా, రాస్తారోకో దిగారు. రాస్తారోకో చేస్తున్న వారిపై లాఠీచార్జి చేసి పోలీసులు చెదరగొట్టారు. పోలీసుల లాఠీచార్జిలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి నల్లమడుగు సురేందర్ గాయపడటంతో  ఆసుపత్రికి తరలించారు. లాఠీచార్జికి నిరసనగా శుక్రవారం(రేపు) కాంగ్రెస్‌ నాయకులు ఎల్లారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు