షూ తీయకుండానే జెండా ఎగురవేశారు

16 Aug, 2019 10:05 IST|Sakshi
షూ తీయకుండానే కొబ్బరికాయ కొడుతున్న ఏఎస్సై

సాక్షి, చెన్నారావుపేట(వరంగల్‌) : భారత దేశంలో ఉండే ప్రతి ఒక్కరు జాతీయ జెండాను గౌరవించాల్సిందే.. ఓ దేవాలయానికి వెళితే దేవును ముందు చెప్పులు దూరంగా విడిచి మొక్కులు చెల్లించడం, పూజలు చేయడం జరుగుతుంది. అలాంటి దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంలో అన్ని మాతాలు గౌరవించే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా కొబ్బరికాయ కొట్టే సమయంలో ఏఎస్సై సాంబరెడ్డి వేసుకున్న షూ తీయకుండానే జాతీయ జెండాను అవమానించారు. పైగా అక్కడ ఉన్న పలువురు షూ తీయాలని చెప్పిన ఏమి కాదులే అని అమర్యాదగా మాట్లాడం పలువురిని విస్మయానికి గురిచేసింది. 

మరిన్ని వార్తలు