పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

28 Jun, 2015 13:35 IST|Sakshi

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలంలో గుట్టుగా సాగిస్తున్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ. 10 వేలు నగదు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని మల్లారం, బెల్యానాయక్ తండా పరిధిలోని తోటల్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికే ముగ్గురు పేకాట రాయుళ్లు పరారవ్వగా.. పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
 

>
మరిన్ని వార్తలు