సాక్షి , ఆదిలాబాద్: అమ్మా.. చెల్లీ... అన్నా దండం పెట్టి చెబుతున్నాం... ప్రయాణాలు చేయకండి....ఇళ్ళకే పరిమితం కండి... కరోనా వైరస్ నివారణకు సహకరించండంటూ వాహనదారులను వేడుకున్నారు ట్రాఫిక్ పోలీసులు... మనలో ఉందో లేదో ఎలా వస్తుందో కూడా చెప్పలేం, ఇంటిల్లిపాది, గ్రామం, దేశం సురక్షంగా ఉండాలంటే సహకరించండంటూ ఇలా రోడ్లపై తిరిగితే వైరస్ను కట్టడి చేయలేమని కోరారు... పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద సోమవారం రాజీవ్ రహదారిపై వచ్చి పోయే ప్రయాణికులకు ఇలా మూకుమ్మడిగా దండాలు పెడుతూ వినూత్న కౌనెల్సింగ్ నిర్వహించారు పెద్దపల్లి ట్రాఫిక్ సిబ్బంది..