'అవసరమైతే లాఠీ పడతారు, లేకుంటే సేవ చేస్తారు'

25 May, 2015 20:41 IST|Sakshi

హైదరాబాద్: పోలీసులు అవసరమైతే లాఠీలు పడతారని, లేకుంటే ప్రజా సేవ చేస్తారని తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మధ్యలోనే ఆగిపోయిందని చెప్పారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించిన స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు పోలీసులు అధికారులు పాల్గొంటున్నారు.

>
మరిన్ని వార్తలు