టీకా వికటించి చిన్నారి మృతి

13 Sep, 2015 09:37 IST|Sakshi

నాగోలు (హైదరాబాద్) : నాగోలులో విషాదం చోటుచేసుకుంది. టీకా వికటించడంతో ఓ చిన్నారి మృతిచెందింది. పోలియో చుక్కలు వేయడంతోనే చిన్నారి మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాగోలులోని విజయపురి కాలనీకి చెందిన ప్రణవికి శనివారం అంగన్‌వాడీ సెంటర్‌లో పోలియో చుక్కలు వేయించారు. అయితే అప్పటి నుంచి అస్వస్థతకు గురైన ప్రణవి ఆదివారం ఉదయం ప్రాణాలొలింది. దీంతో చిన్నారి మృతికి పోలియో చుక్కలే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.

మరిన్ని వార్తలు