నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్

5 Dec, 2015 11:27 IST|Sakshi

నల్లగొండ జిల్లాలోని మూడు మండలాల్లోని 9 గ్రామాల్లో పంచాయతి ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకే పోలీంగ్ ఉండంతో.. పోలీంగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. 9 గ్రామాల్లో 94 వార్డులు, 9 సర్పంచ్ స్థానాల కోసం జరుగుతున్న ఈ పోటీలో 245 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

మరో వైపు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కానేరమ్మపేట మేజర్ గ్రామపంచాయతికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రానికి ఈ గ్రామ పంచాయితీల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు