హైదరాబాద్: తెలంగాణ ఎన్జీవో నేతలు టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ఉద్యోగుల విభజనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు బాధ్యతలు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యలు పట్టించుకోకపోతే దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్ లను ఉద్యోగ సంఘాల పదవుల నుంచి తప్పించే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు.