పేలుడు పదార్థాలు స్వాధీనం

26 Dec, 2015 10:41 IST|Sakshi

అక్రమంగా నిలవ ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేటలో శనివారం ఉదయం పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. స్థానికంగా రాళ్లు కొట్టే పని చేసే ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్లను పెద్ద మొత్తంలో కనుగొన్నారు.
కాగా.. ఈ పేలుడు పదార్థాలు ఎందుకు నిలవ చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి. వీటిని ఎవరికి అందజేయనున్నారు. పేలుడు పదార్థాల అక్రమ నిలవ వెనుక ఎవరి ప్రమేయం ఉందని అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
 

>
మరిన్ని వార్తలు