కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తికి అంతరాయం

9 Nov, 2015 19:16 IST|Sakshi

ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 5వ దశ 9వ యూనిట్‌లో సోమవారం మధ్యాహ్నం 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది. యూనిట్‌లోని బాయిలర్ ట్యూబ్ లీకేజీ సమస్య తలెత్తడంతో ఉత్పత్తి నిలిపేశారు. వెంటనే సీఈ ఎం.సిద్ధయ్య నేతృత్వంలో మరమ్మతులు చేపట్టారు. మంగళవారం ఉదయం నాటికి ఉత్పత్తి పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.



 

మరిన్ని వార్తలు