ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాదర్బార్కు అధికారులు సకాలంలో హాజరు కాక సోమవారం రంగారెడ్డి జిల్లా ధారూరు మండల పరిషత్ కార్యాలయం వెలవెలబోయింది. ఉదయం 10:30 గంటలకు కార్యాలయానికి అధికారులు రావాల్సి ఉన్నా.. 11:45 గంటలైనా ఏ ఒక్కరూ రాకపోవడంతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. మోమిన్ఖుర్దు గ్రామానికి చెందిన వృద్ధురాలు బీజాన్బీ.. తనకు పింఛన్ ఎందుకు రాలేదో.. తెలుసుకునేందుకు వచ్చినా.. అధికారులు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగి పోయింది.