భర్త మృతదేహాన్ని చూసి బోరుమన్న అమృత

16 Sep, 2018 08:18 IST|Sakshi

సాక్షి, నల్గొండ : పరువు హత్యకు గురైన ప్రణయ్‌ మృతదేహాన్ని చూసి భార్య అమృత కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రాణానికి ప్రాణంలా ప్రేమించిన భర్త  విగతజీవిలా మారిపోవడాన్ని చూసిన అమృత బోరుమంది. అమృతను ఆస్పత్రి నుంచి పోలీసులు ప్రణయ్‌ మృతదేహం వద్దకు తీసుకొచ్చారు. దాంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన అమృత.. కలకాలం నిండు జీవితాన్ని పంచుకోవాలనుకున్న భర్త ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోదిస్తోంది. 

కాగా, ప్రణయ్‌ సోదరుడు ఉక్రెయిన్‌ నుంచి ఉదయం 11గంటకు మిర్యాలగూడ చేరుకోనున్నారు. అనంతరం ప్రణయ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడలో టెన్షన్‌ వాతావరణం కొనసాగుతోంది. దీంతో మారుతిరావు ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

అమృత తండ్రి ప్రస్థానం ఎలా మొదలైందంటే?

ప్లీజ్‌.. ప్రణయ్‌ దగ్గరికి తీసుకువెళ్లండి

నయీం గ్యాంగ్‌తో బెదిరించారు

మరిన్ని వార్తలు