పీఆర్సీ నివేదిక సిద్ధం 

23 Nov, 2019 04:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సవరిస్తూ వేతన సవరణ కమిషన్‌ (పీఆర్సీ) తన నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పీఆర్సీ నివేదికను 12 రోజుల్లో సమర్పించాలన్న సీఎం ఆదేశాల మేరకు నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై ఓ నిర్ధారణకు వస్తూ కమిషన్‌ వర్గాలు నివేదికను సిద్ధం చేశాయి. ఈనెల 22 నాటికే సీఎం విధించిన గడువు పూర్తికావడంతో ఈ మేరకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం నివేదికను రూపొందించారు.

అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నివేదిక సమర్పణకు పిలుపు రావాల్సి ఉందని, ఆ పిలుపు వచ్చిన వెంటనే నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 25న లేదా 27న పీఆర్సీ నివేదికను సీఎంకు సమర్పించే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి.   
 

>
మరిన్ని వార్తలు