ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి

28 Mar, 2015 15:21 IST|Sakshi

నిజామాబాద్ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి వెంటనే నీటిని కాకతీయ కాలువకు విడుదల చేయాలని శనివారం రైతులు ఆందోళన చేపట్టారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎస్సారెస్పీ వచ్చిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. తమతో కలిసి రావాలని రైతులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో మోర్తాడ్, కమ్మర్‌పల్లి, బాల్కొండ మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
(శ్రీరాంసాగర్)

మరిన్ని వార్తలు