‘కొండగట్టు బాధితులను తక్షణమే ఆదుకోవాలి’

13 Sep, 2018 20:47 IST|Sakshi
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రోఫెసర్‌ కోదండరామ్‌

సాక్షి, కరీంనగర్‌ : కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రోఫెసర్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. గురువారం కొండగట్టు బస్సు ప్రమాదంలో గాయపడి కరీంనగర్‌లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సు ప్రమాదానికి ఆర్టీసీ అధికారుల పని ఒత్తిడి, ఓవర్‌ డ్యూటీనే కారణమని ఆరోపించారు. అంత పెద్ద సంస్థకు ఎండీ లేకపోవటం విచారకరమన్నారు. తక్షణమే ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ను ఎండీగా నియమించాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు