నగరంలో నిషేధాజ్ఞల పొడిగింపు

3 Mar, 2015 19:39 IST|Sakshi

హైదరాబాద్‌ : నగరంలో కొనసాగుతున్న నిషేదాజ్ఞల గడువును మరో వారం రోజులు పొడిగిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ, సచివాలయం చుట్టుపక్క ప్రాంతాలలో పోలీసు అనుమతి లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాలు, ధార్నలు, రాస్తారోకోలు,  ప్రసంగాలే చేయరాదని ఉత్తర్వులు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 10వ తేదీ వరకు అమలులో ఉంటాయి. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహేందర్‌రెడ్డి హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు