-

బ్యాంకులో సైకో వీరంగం

21 Nov, 2017 14:01 IST|Sakshi

సాక్షి, నిడమనూరు: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం ఆంధ్రాబ్యాంకులో ఓ సైకో వీరంగం సృష్టించాడు. బ్యాంకులోకి వచ్చిన అతను సిబ్బందిని తిట్టి.. దాడి చేశాడు. సైకో దాడిలో పలువురు గాయపడ్డారు. అంతటితో ఆగకుండా మేనేజర్ చాంబర్ అద్దాలు పగులగొట్టాడు. ఇతను మండలంలోని మెగ్యా తండాకు చెందిన కేతావత్ కృష్ణ అని తెలిసింది. 

మరిన్ని వార్తలు