డ్రైవర్‌ గారూ.. మాస్క్, శానిటైజర్‌ ఇస్తున్నారా?

28 May, 2020 11:59 IST|Sakshi

ఖమ్మం: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మీవంతు బాధ్యతను నెరవేర్చండి డ్రైవర్‌ గారూ. మీ డిపోలో మాస్క్‌లు, శానిటైజర్లు ఇస్తున్నారా?’ అంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బుధవారం ఓ బస్సు డ్రైవర్‌ను అడిగి తెలుసుకున్నారు. బస్సులో ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చూడండి అంటూ సూచించారు. ఖమ్మం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఇన్‌ గేట్‌ వద్ద ఆగి బస్సు డ్రైవర్‌ను మంత్రి అడుగుతున్న దృశ్యం ‘సాక్షి’ కంటపడింది. –సాక్షి సీనియర్‌ ఫొటో జర్నలిస్ట్, ఖమ్మం

మరిన్ని వార్తలు