శుక్ర,శనివారాల్లో ప్రశ్నోత్తరాలు రద్దు

24 Nov, 2014 09:58 IST|Sakshi

హైదరాబాద్ : .బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 29 వరకూ శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. అలాగే శుక్ర, శనివారాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. అలాగే ఈనెల 28న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ...చివరి రోజున ప్రాధాన్యత గల అంశాలపై చర్చించనుంది. మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై సభలో నేడు చర్చ జరగనుంది.

 

మరిన్ని వార్తలు