బీసీ బిల్లుపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి

29 Mar, 2017 03:07 IST|Sakshi
బీసీ బిల్లుపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి

సీఎం కేసీఆర్‌కు ఆర్‌.కృష్ణయ్య వినతి
సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్ల కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌ సాధనకు అఖిలపక్ష బృందాన్ని, బీసీ సంఘాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్‌కు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం సీఎం కేసీఆర్‌ను ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో డా.ర్యాగ అరుణ్, గుజ్జకృష్ణ, ఎర్రసత్యనారాయణ, నీల వెంకటేష్, కృష్ణుడు, నర్సింహాగౌడ్, భార్గవ్, తదితరులు వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా మెస్‌ చార్జీలు, స్కాలర్‌షిప్‌లను పెంచినందుకు సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు