మహేష్‌ భగవత్‌పై డీసీపీ ఫిర్యాదు

26 Apr, 2018 19:59 IST|Sakshi
మహేష్‌ భగవత్‌ (దాచిన చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌ : రాచకొండ డీసీపీ  పులిందర్‌ రెడ్డి, తన ఉన్నతాధికారి రాచకొండ పోలీస్‌ కమీషనర్‌పై మానవహక్కుల కమీషన్‌లో ఫిర్యాదు చేశారు. కమీషనర్‌ మహేష్‌ భగవత్‌ తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పులీందర్‌ రెడ్డి తనన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీసీపీ ఫిర్యాదును స్వీకరించిన కమీషన్‌ సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆగస్టు ఒకటో తేదీన రిపోర్టు ఇవ్వాలని తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డీజీపీ మహేందర్‌ రెడ్డికి మానవహక్కుల కమీషన్‌ ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు