మలివిడత ప్రచారానికి రాహుల్, సోనియా దూరం 

7 Apr, 2019 03:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మలివిడత ప్రచారానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నెల 9తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి మన్నెగూడలో ఈ నెల 8న జరగనున్న భారీ బహిరంగ సభను 7వ తేదీకి మార్చారు. ఈ సభకు సోనియా ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల ఆమె తెలంగాణకు రావడం లేదని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ సభకు జాతీయ నాయకులు గులాం నబీ ఆజాద్, సచిన్‌ పైలట్‌లు హాజరుకానున్నారని పేర్కొన్నాయి. ఇప్పటికే తొలివిడత ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ కూడా మలివిడత రావడం లేదని తెలిపాయి.    

మరిన్ని వార్తలు