ఖరారైన రాహుల్ తెలంగాణ పర్యటన

5 May, 2015 17:05 IST|Sakshi

హైదరాబాద్ : కాంగ్రెస్ యువనాయకుడు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టదలచిన రైతు ఆత్మగౌరవ యాత్రకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 10వ తేదీ సాయంత్రం హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంకు వెళ్తారు. అయితే  ఆ రాత్రి రాహుల్ గాంధీ బస చేయడానికి ఏజెన్సీ ప్రాంతంలోని సాయినగర్ తండా, మహావీర్‌తండా, పోటుపల్లి, జహ్నం నాలుగు గ్రామాలను ఇప్పటికే టీపీసీసీ పరిశీలించింది.  ఈ నాలుగు గ్రామాల్లో ఏదో ఒక గ్రామంలో ఆయన బస చేయనున్నట్లు సమాచారం.

కాగా 11వ తేదీన ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలో జరిగే ఆత్మగౌరవ యాత్రలో రాహుల్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన 15 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా రాహుల్ జిల్లాలోని లక్ష్మణ్‌చంద మండలంలోని వద్యాలు, రాచాపూర్, పోటుపల్లి, లక్ష్మణ్‌చంద, కోరటికల్లు గ్రామాల్లో పర్యటించి ఐదు రైతు కుటుంబాలను రాహుల్ పరామర్శిస్తారు.

మరిన్ని వార్తలు