అల్వాల్ (హైదరాబాద్): రామ్దేవ్ బాబా పేరుతో అనుమతి లేకుండా నూడుల్స్ తయారు చేస్తున్న అల్వాల్లోని ఓ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. రెండు వేల కిలోల నూడుల్స్ ప్యాకెట్లు, కాలం చెల్లిన 85 కిలోల గోధుమపిండిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.