మూసీ నది బ్రిడ్జిపై ప్రమాదం.. మృతులు రైల్వే ఉద్యోగులు

22 Jul, 2020 15:07 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి: వికారాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. రైలు ఇంజన్‌ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో మూసీ నదిపై ఉన్న బ్రిడ్జిపై 12 మంది రైల్వే ఉద్యోగులు పెయింటింగ్‌ వర్క్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ రైలు ఇంజన్‌ హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ వస్తోంది. ఇది గమనించి ఉద్యోగులు అక్కడి నుంచి తప్పుకున్నారు. కానీ ముగ్గురు మాత్రం అక్కడే చిక్కుకుపోయారు. దాంతో ఇంజన్‌ ఢీకొని ఆ ముగ్గురు రైల్వే ఉద్యోగులు అక్కడిక్కడే మరణించారు. మృతి చెందిన వారిని నవీన్ (34), శంషీర్ అలీ (22), ప్రతాప్ రెడ్డి (58)గా గుర్తించారు. 

మరిన్ని వార్తలు