-
సాక్షి, హైదరాబాద్: బిహార్ పశ్చిమ ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.