సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు సాధారణంగా కొనసాగుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజుల్లో రుతుపవనాలు చురుగ్గుగా కదిలే అవకాశం ఉన్నట్టు తెలిపింది. పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా రెండురోజుల్లో ఉష్టోగ్రతలు తగ్గుతాయని తెలిపింది.