తెలంగాణ రాజ్‌భవన్‌లో 10మందికి కరోనా పాజిటివ్‌

12 Jul, 2020 21:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో ఒక్కసారిగా కరోనా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో 398మంది రాజ్‌భవన్‌ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 28మంది పోలీసు సిబ్బందికి, 10మంది రాజ్‌భవన్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 347 మంది సిబ్బందికి కరోనా నెగిటివ్ అని తేలింది. కరోనా పరీక్షల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరాజన్‌, ఇతర సీనియర్‌ అధికారులకు నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా రెడ్‌జోన్లో కాంటాక్ట్ హిస్టరీ ఉన్నవారు కరోనా టెస్ట్‌ చేయించుకోవాలని గవర్నర్‌ తమిళి సై ప్రజలకు సూచించారు.

మరిన్ని వార్తలు