రాజయ్య బెయిల్ పిటిషన్ కొట్టివేత

29 Dec, 2015 02:56 IST|Sakshi

సాక్షి, హన్మకొండ: రిమాండ్‌లో ఉన్న మాజీ ఎంపీ రాజయ్యకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. కోడలు సారిక ముగ్గురు మనవళ్ల ఆత్మహత్య కేసులో మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ వరంగల్ సెంట్రల్ జైలులో నవంబర్ 4 నుంచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ ఇవ్వాలంటూ రాజయ్య పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ  జరిపిన జిల్లా కోర్టు.. బెయిల్ తిరస్కరించింది. ఇప్పటి వరకు రాజయ్య, అయన భార్య మాధవి మూడు సార్లు , అనిల్ రెండు సార్లు బెయిల్ కోసం అభ్యర్థించగా కోర్టు తిరస్కరించింది.

మరిన్ని వార్తలు