రామప్ప ఆలయం అద్భుతం

7 Dec, 2015 03:10 IST|Sakshi
రామప్ప ఆలయం అద్భుతం

మహాత్మాగాంధీ మనుమడు రాజ్‌మోహన్ గాంధీ

 వెంకటాపురం: రామప్ప ఆలయ నిర్మాణశైలి, శిల్పకళ అద్భుతమని జాతిపిత మహా త్మాగాంధీ మనుమడు రాజ్‌మోహన్‌గాంధీ అన్నారు. ఇన్‌టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావుతో కలసి ఆదివారం ఆయన వరంగల్ జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు రామప్ప రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  రామప్ప ఆల యాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని రాజ్‌మోహన్ గాంధీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు