కిరాణా షాపులో రేషన్ బియ్యం పట్టివేత

10 Apr, 2017 12:55 IST|Sakshi

ఆత్మకూర్ : నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఓ కిరాణా షాపుపై విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. చౌక ధరల దుకాణం ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన 50 కిలోల చక్కెర, క్వింటాన్నర బియ్యం షాపులో విక్రయానికి ఉండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యజమాని చందా రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు