రంగారెడ్డి జిల్లాలో ఎస్వోటీ తనిఖీలు

11 Jan, 2016 11:11 IST|Sakshi
మైలార్దేవ్ పల్లి: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి- శాస్త్రిపురంలోని ఓ గోడౌన్‌పై ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 4 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, ఓ డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
>
మరిన్ని వార్తలు