20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

11 Jul, 2015 14:01 IST|Sakshi

కరీంనగర్: పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని విజిలెన్స్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో అక్రమ బియ్యాన్ని తరలిస్తున్నారని సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడి చేసారు. బియ్యాన్ని తరలిస్తున్న ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

మరిన్ని వార్తలు