రియల్ ఎస్టేట్ వ్యాపారి అదృశ్యం

29 May, 2016 17:58 IST|Sakshi

బోడుప్పల్ (హైదరాబాద్) : ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కనిపించకుండాపోయిన సంఘటన ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ వెంకటయ్య సమాచారం మేరకు... బోడుప్పల్ బృందావన్ కాలనీలో నివసించే చింతల యాదిరెడ్డి(40) లావణ్య భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు.

యాదిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. ఈ క్రమంలో ఈ నెల 14 రాత్రి 9 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఇంటికి రాలేదు. పలు ప్రాంతాల్లో వెతికినా కనిపించకపోవడంతో ఆదివారం కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు