బరిలో రెబెల్స్‌

23 Nov, 2018 13:34 IST|Sakshi

బెల్లంపల్లి, చెన్నూరులో మాజీ మంత్రులు వినోద్, బోడ

ముథోల్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌

పలుచోట్ల కాంగ్రెస్, టీజేఎస్‌ అభ్యర్థులు

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం గురువారం ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య తేలిపోయింది. ఆదిలాబాద్‌లోని రెండు నియోజకవర్గాల్లో 21 మంది, నిర్మల్‌ జిల్లాలోని మూడు సెగ్మెంట్లలో 32 మంది, మంచిర్యాల జిల్లాలోని మూడు స్థానాల్లో 48 మంది, కుమురంభీం జిల్లాలలోని రెండు నియోజకవర్గాల్లో 22 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు పక్కలో బల్లెంలా రెబెల్స్‌ బరిలోనే ఉన్నారు.
ప్రధానంగా కాంగ్రెస్‌ టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్లు ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. బెల్లంపల్లిలో మాజీ మంత్రి వినోద్‌ బీఎస్పీ నుంచి పోటీలో నిలిచారు. చెన్నూరులో మరో మాజీ మంత్రి బోడ జనార్దన్‌ బీఎల్‌పీ నుంచి తలపడుతున్నారు. ముధోల్‌లో నియోజకవర్గంలో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోరాడి ఓడిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌ ఎన్‌సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌ రెబెల్‌గా అజ్మీరా హరినాయక్‌ బీఎస్పీ నుంచి పోటీ చేస్తుండగా, ప్రజాకూటమిలో భాగస్వామిగా ఉన్న టీజేఎస్‌ నుంచి తాట్ర భీంరావు సైతం పోటీలో ఉన్నారు.  

మరిన్ని వార్తలు