సాక్షి కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్‌డే వేడుకలు

26 Jan, 2019 10:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సాక్షి మీడియా గ్రూపు ప్రధాన కార్యాలయంలో శనివారం 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ కార్యాలయంలో సాక్షి ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వైఈపీ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో సాక్షి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్, జర్నలిజం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ దిలీప్‌ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావులతో పాటు సాక్షి పత్రిక, ఎలక్ట్రానిక్‌, వెబ్ మీడియా సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు