ఆదివాసీల స్థితిగతులపై పరిశోధన

26 Nov, 2018 18:34 IST|Sakshi
ఆదివాసీలతో ప్రొఫెసర్లు 

సాక్షి,ఆదిలాబాద్‌రూరల్‌ : మండలంలోని చించుఘాట్‌ గ్రామంలో ఆదివాసీల స్థితిగతులు, ఆయుర్వేదానికి సంబంధించిన చెట్లపై మధ్యప్రదేశ్‌లోని అమరకంఠన్‌ ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ ప్రొఫెస ర్లు ఆదివారం పరిశోధన చేశారు. ఆదివాసీల జీవన విదానం, తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు ప్రొఫెసర్లు మాట్లాడుతూ రానురానూ గోండి భాష కనుమరుగయ్యే ప్రమాదముందన్నారు. పుట్టుక నుంచి చావు వరకు దేవతలను పూజించడం, వారి సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన పాటలు, తదితర వాటిని రికార్డింగ్‌ చేసుకున్నామని ప్రొఫెసర్లు వెల్లడించారు. ఈ ప్రొఫెసర్ల బృందంలో వినయ్‌కుమార్‌ తివారీ, బిరేంద్ర ప్రతాప్‌సింగ్, సౌరభ్‌ కుమార్, హేమంత్‌రావు, గ్రామ పెద్దలు లింగు, అనిల్‌కుమార్, బిపిన్‌కుమార్, హర్షన్‌రావు, తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు