హైదరాబాద్: తన పదవికి రాజీనామా చేయనున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే నగరంలోని ధూల్పేటలో ప్రజలకు పునరావాసం కల్పిస్తానని చెప్పి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇప్పుడు ఇచ్చిన మాటను మర్చిపోయారని ఆరోపించారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని సీఎంకు అందజేయనున్నట్లు తెలిపారు. తన రాజీనామాతోనైనా ప్రజల కష్టాలపై ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.