జానారెడ్డిని పరామర్శించిన రేవంత్‌

21 Nov, 2017 13:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డిని మంగళవారం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా  జానారెడ్డి ప్రస్తుతం సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 16న అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఆయన ...అక్కడే అస్వస్థతకు గురి కావడంతో ...హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి జానారెడ్డి ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన కోలుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు