హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ అంటే ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోవడం కాదని, స్వచ్ఛందంగా పరిసరాలను శుభ్రం చేయడమేనని రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్కాలనీ కమ్యూనిటీహాల్లో బుధవారం స్వచ్ఛ హైదరాబాద్పై సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ...స్వచ్ఛ హైదరాబాద్ వల్ల మంచి ఫలితాలు రావాలన్నదే ముఖ్యమంత్రి అభిమతమని చెప్పారు. ఏదో రెండు చీపుర్లు పట్టుకుని ఊడ్చినట్టుగా చూపించి వెళ్లడం వల్ల ఉపయోగం ఉండదని, చేసే పని సరిగా లేకుంటే పరిశుభ్రత ఉండదని పేర్కొన్నారు. మెంటర్, నోడల్ అధికారులుగా ఉన్నవారు తప్పకుండా దీనికి న్యాయం చేయాలని సూచించారు.