అమ్మా.. నాన్న ఎక్కడ

18 Sep, 2018 07:55 IST|Sakshi
నరేశ్‌రెడ్డి మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, బంధువులు, అమాయకంగా చూస్తున్న బాలుడు

ఇల్లందకుంట(హుజూరాబాద్‌): అమ్మా.. నాన్న ఎక్కడా.. ఎందుకు ఏడుస్తున్నావు.. అంటూ చిన్నారి తన తల్లితో అంటున్న మాటలు విని గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నన్ను చూడడానికి ఇంటికి వస్తూ అనంతలోకాలకు వెళ్లావా కొడుకా.. అంటూ తల్లి రోదనలతో అందరూ కన్నీటిపర్యంతమయ్యారు. మండలంలోని లక్ష్మాజిపల్లె గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి అరుణ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు ఉప్పుల నరేశ్‌రెడ్డి ఖమ్మం జిల్లాలో మెడికల్‌ రిప్రజెంటేటీవ్‌గా పనిచేస్తున్నారు.

కొన్నాళ్ల క్రితం సైదాపూర్‌ మం డలం రాయికల్‌కు చెందిన గీతతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. ప్రస్తుతం వీరు హన్మకొండలో నివసిస్తున్నారు. ఆదివారం వీఆర్వో పరీక్ష రా సిన తర్వాత భార్య, కుమారుడిని ఇంటి వద్ద దింపి తన స్వగ్రామానికి బయలుదేరారు. ఈక్రమంలో కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. నరేశ్‌రెడ్డి మృతిలో గ్రామంలో విషాదం అలుముకుంది.

మరిన్ని వార్తలు