మూసాపేటలో రోడ్డు ప్రమాదం

7 Mar, 2018 06:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : మూసాపేటలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని సెయింట్‌ సంస్థకు చెందిన సోని ట్రావెల్స్‌ మాదాపూర్‌ నుంచి 40 మంది ఉద్యోగులతో  మాదాపూర్‌​ నుంచి చింతల్‌ బయలు దేరింది. అయితే డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటంతో మూసాపేట రైలింగ్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో అదుపుతప్పి ఫైఓవర్‌ నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాంగ్‌ రూట్‌లో రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు