సాక్షి, హైదరాబాద్ : మూసాపేటలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని సెయింట్ సంస్థకు చెందిన సోని ట్రావెల్స్ మాదాపూర్ నుంచి 40 మంది ఉద్యోగులతో మాదాపూర్ నుంచి చింతల్ బయలు దేరింది. అయితే డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో మూసాపేట రైలింగ్ డివైడర్ను ఢీకొట్టడంతో అదుపుతప్పి ఫైఓవర్ నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాంగ్ రూట్లో రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.