ఎస్‌బీహెచ్ ఏటీఎంలో చోరీయత్నం

4 Dec, 2015 09:32 IST|Sakshi
వరంగల్ : వరంగల్ నగరంలోని మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఏటీఎం లో చోరీ యత్నం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఏటీఎం పగలగొట్టి దొంగతనానికి  ప్రయత్నించారు. ఏటీఎం లాకర్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఏటీఎం స్వల్పంగా దెబ్బతిన్నది. విషయం తెలిసి బ్యాంకు అధికారులు, పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
 
 
మరిన్ని వార్తలు