గోదావరిఖని (కరీంనగర్ జిల్లా): గత కొంత కాలంగా జిల్లాలో పలు ఇళ్లలో చొరబడి ఆభరణాలను దోచుకెళ్తున్న దొంగలముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం కరీంనగర్లో ఎస్పీ శివకుమార్ మీడియా సమావేశంలో వివరాలను తెలియజేశారు.
దొంగల ముఠా గోదావరిఖనిలో పలు ఇళ్లలో బంగారు ఆభరణాలను ఆపహరించినట్టు చెప్పారు. ఈ ముఠాను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.41 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.