దుస్తుల దుకాణంలో భారీ చోరీ

21 Aug, 2015 10:25 IST|Sakshi

కడెం: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ దుకాణంలో భారీ చోరి జరిగింది. దుకాణం వెనుక భాగం నుంచి రంధ్రం చేసి వెళ్లిన దుండగులు రూ. 1.45 లక్షల నగదు, కొన్ని దుస్తులను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. కాగా, శుక్రవారం దుకాణం తెరిచిన యజమానికి దొంగతనం విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేప్టటారు. కేసు నమొదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

>
మరిన్ని వార్తలు