మత్తుమందు చల్లి చోరీ..

21 Nov, 2015 15:24 IST|Sakshi


ఎల్బీనగర్ (హైదరాబాద్) : ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తులపై గుర్తుతెలియని దుండగులు మత్తు మందు చల్లి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో ఉడాయించిన సంఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ వెంకట్ రెడ్డి కాలనీలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మధుసూదన్ అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం రాత్రి కిటికీ అద్దాలు పగులగొట్టుకొని లోపలికి వచ్చిన దుండగులు ఇంట్లో నిద్రిస్తున్న వాళ్లపై మత్తు మందు చల్లి బీరువాలో ఉన్న 40 తులాల బంగారం, కిలోన్నర వెండి ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని శనివారం స్పృహలోకి రావడంతో దొంగతనం విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు