25 తులాల బంగారం చోరీ

10 Jan, 2016 11:32 IST|Sakshi

కోరుట్ల (కరీంనగర్) : తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో దొంగలు పడి 25 తులాల బంగారం, రూ. 50 వేల నగదు ఎత్తుకెళ్లిపోయారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం పెద్దపూర్‌లో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన రెండిళ్లలో శనివారం రాత్రి దొంగలు పడి రూ. 50 వేల నగదుతో పాటు 25 తులాల బంగారునగలు దోచుకెళ్లారు. ఆదివారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన  పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు